
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ: 28–05–2024
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం
తేదీ : 31–05–2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి
తేదీ : 21–06–2025
ప్రత్యేక అవసరాలు గల, స్పోర్ట్స్, ఎన్సీసీ విద్యార్థులకు చివరి తేదీ : 25–07–2025
ఎంపిక జాబితా ప్రకటన : 04–07–2025
మొదటి విడత కౌన్సిలింగ్ : 07–07–2025
పెద్దవూర: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్టీయూకేటీ) పరిధిలోని బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బాసర ట్రిపుల్ ఐటీలో 1500, ఈ యేడాది ప్రారంభం కానున్న మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో 180 సీట్లు కేటాయించారు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రవేశ అర్హతలు
2025లో నిర్వహించిన ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం 1500 సీట్లకు గాను 85శాతం సీట్లు రాష్ట్ర వాసులకే కేటాయించారు. మిగతా 15శాతం సీట్లు ఓపెన్ కేటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.
రిజర్వేషన్లు ఇలా..
ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం,బీసీ–ఏ 7శాతం, బీసీ–బీ 10శాతం, బీసీ–సీ 1 శాతం, బీసీ–డీ 7శాతం, బీసీ–ఈ 4శాతం, ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు 3శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2శాతం, ఎన్సీసీ విద్యార్థులకు 1శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5శాతం భర్తీ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కాకుండా వేరే రాష్ట్రాల వారికి, భారతీయ ఫౌరసత్వం కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ప్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్ల లకు అదనపు సీట్లు కేటాయిస్తారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.33శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్ పాటిస్తారు. విద్యార్థులు మీసేవా, పీఎస్ ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.500, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1500 లు, ఎన్ఆర్ఐ అభ్యర్థులు 100 యూఎస్ డాలర్లు ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సెంటర్ సర్వీస్ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు.
ప్రవేశ విధానం
పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 4శాతం మార్కులు(ప్రతి సబ్జెక్టుకు 4 మార్కులు మొత్తం 24 మార్కులు) విద్యార్థికి వచ్చిన పదో తరగతి మార్కులకు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన మార్కులు వస్తే అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. మొదట గణితం, తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లిష్, ఆ తర్వాత సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. గ్రేడ్ పాయింట్లు సమానమైతే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. ఇవి సమానంగా ఉంటే హాల్ టికెట్ నంబర్ను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.
కౌన్సిలింగ్లో సమర్పించాల్సిన
ధ్రువపత్రాలు
దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాలన్నింటిని కౌన్సిలింగ్కు వచ్చే సమయంలో దగ్గర ఉంచుకోవాలి. ఆన్లైన్ ధరఖాస్తు ఫారం ప్రింట్ అవుట్, దరఖాస్తు చేసుకున్న రశీదు, ఆధార్ కార్డు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల షీటు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య ధ్రువీకరణ పత్రం, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువపత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువపత్రాలు సమర్పించాలి. కౌన్సిలింగ్కు ఎంపికై న విద్యార్థుల జాబితా యూనివర్సిటీ వెబ్సైట్ www.rgukt.ac.in లేదా www.admissions. rgukt.ac.in లో ప్రదర్శించనున్నారు.
30హెచ్ఎల్ఏ201,202
బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్
ఐటీల్లో 2025–26లో ప్రవేశాలకు
నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి 21వ తేదీ వరకు
దరఖాస్తుల స్వీకరణ
జూలై 4న ఎంపిక జాబితా
ఈ ఏడాది నుంచే ప్రారంభంకానున్న
మహబూబ్నగర్ ట్రిపుల్ఐటీలో
180 సీట్లు కేటాయింపు