ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

May 31 2025 1:20 AM | Updated on May 31 2025 1:20 AM

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

సూర్యాపేట అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, మావోయిస్టులతో చర్చలు జరిపి ఆపరేషన్‌ నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిర ఇళ్లు ఇవ్వాలన్నారు. జూన్‌ 8న సీపీఐ జిల్లా మహాసభలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్న చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు ఎల్లవుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, ధూళిపాల ధనుంజయ నాయుడు, మేకల శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎల్లంల యాదగిరి, పోకల వెంకటేశ్వర్లు, హనుమంతరావు, గుండు వెంకటేశ్వర్లు, దేవరం మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

పల్లా వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement