
బాస్కెట్బాల్ భారత జట్టుకు మిర్యాలగూడ వాసి
మిర్యాలగూడ: బాస్కెట్బాల్ అండర్–16 భారత జట్టుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త జొన్నలగడ్డ వెంకట్రెడ్డి కుమార్తె విహారెడ్డి ఎంపికై ంది. జూన్ 10 నుంచి మాల్దీవ్స్లో జరిగే ఏషియన్ గేమ్స్లో నిర్వహించే బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరుపున విహారెడ్డి పాల్గొననుంది. తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా జాతీయ జట్టుకు ఎంపికై న విహారెడ్డిని మిర్యాలగూడకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. రాష్ట్రానికి పేరు ప్రఖ్యా తలు తీసుకురావాలని ఆకాంక్షించారు.