యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు

Jun 8 2025 1:21 AM | Updated on Jun 8 2025 1:21 AM

యాదగి

యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు

భక్తులకు మజ్జిగ, నీళ్లు పంపిణీ

యాదగిరిగుట్ట: భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో శనివారం ఉదయం ఈఓ వెంకట్రావ్‌ క్యూలైన్లు, ఆలయ పరిసరాలను తిరిగి పరిశీలించారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. దీంతో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది క్యూలైన్లు, మాడ వీధుల్లో భక్తులకు మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.

యాదగిరిగుట్ట: వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్టకు శనివారం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైన, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,19,135 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరగనుందని ఆలయాధికారులు చెబుతున్నారు.

ఫ స్వామివారిని దర్శించుకున్న

లక్ష మందికి పైగా భక్తులు

ఫ ధర్మ దర్శనానికి మూడు గంటల

పైగానే సమయం..

యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు1
1/1

యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement