రేకుల షెడ్‌ పైనుంచి పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రేకుల షెడ్‌ పైనుంచి పడి యువకుడి మృతి

Jun 8 2025 1:21 AM | Updated on Jun 8 2025 1:21 AM

రేకుల

రేకుల షెడ్‌ పైనుంచి పడి యువకుడి మృతి

కట్టంగూర్‌: కట్టంగూర్‌ మండలం పామనగుండ్ల గ్రామ శివారులో గల టీమేజ్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో రేకుల షెడ్‌ పైనుంచి పడి యువకుడు మృతిచెందాడు. మృతుడ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మేడి రఘువరన్‌(28) గత ఐదేళ్లుగా టీమేజ్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో బెండింగ్‌ మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీకీ వెళ్లిన రఘువరన్‌ ఉదయం గం.9.45 సమయంలో తనకు సంబంధం లేని పనిచేయాలని కంపెనీ యాజమాన్యం ఆదేశించడంతో.. మరో ఇద్దరు కార్మికులతో కలిసి రేకుల షెడ్డు పైన ఉన్న వెంటిలేషన్‌ రేకులు క్లీన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెంటిలేషన్‌ రేకుపై కాలు పెట్టడటంతో రేకు విరిగి కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి కార్మికులు అతడిని వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.

మృతుడి బంధువులు రాస్తారోకో

రఘువరన్‌ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అతడి బంధువులు శనివారం కంపెనీ ఎదుట విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడి బంధువులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి కంపెనీ వద్దకు చేరుకొని మృతుడి బంధువులను కట్టంగూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుడి తల్లి మేడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. రవీందర్‌ తెలిపారు. మృతుడికి భార్య ఉంది.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే..

టీమేజ్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఉన్న రెండు రేకుల షెడ్లు సుమారు 45 నుంచి 50 ఫీట్ల ఎత్తులో ఉంటాయి. 2017లో ఈ కంపెనీ స్థాపించారు. వెంటిలేషన్‌ కోసం 8ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తెల్లరంగు ప్లాస్టిక్‌ రేకులు పటుత్వం కోల్పోయాయి. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే రఘువరన్‌ మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

ఫ టీమేజ్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

కంపెనీలో ఘటన

ఫ నష్టపరిహారం చెల్లించాలని

మృతుడి బంధువుల ఆందోళన

రేకుల షెడ్‌ పైనుంచి పడి యువకుడి మృతి1
1/1

రేకుల షెడ్‌ పైనుంచి పడి యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement