
జల నారాయణస్వామికి మంగళహారతులు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం రాత్రి జల నారాయణస్వామికి మంగళహారతులు సమర్పించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహారతుల సమర్పణ కార్యక్రమాలను నిర్వహించారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాటు వారంతం కావడంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
స్వర్ణగిరి క్షేత్రాన్ని మిస్ ఏసియా, జాతీయ హ్యాండ్లూమ్ బాసిడర్ రష్మి ఠాగూర్ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

జల నారాయణస్వామికి మంగళహారతులు