మూడు నెలలే గడువు పనులేమో కదలవు! | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలే గడువు పనులేమో కదలవు!

May 3 2025 12:18 AM | Updated on May 3 2025 12:18 AM

మూడు

మూడు నెలలే గడువు పనులేమో కదలవు!

ఆరేళ్లు గడిచినా పూర్తికాని ఆర్‌యూబీ

ఆగస్టు లోపు పూర్తిచేస్తాం

వివేకానంద విగ్రహం నుంచి ఆర్‌యూబీ ప్రవేశ ద్వారం వద్ద 120 మీటర్ల పొడవు రిటైయినింగ్‌ వాల్‌ పనులు జరుగుతున్నాయి. వాహనాలు బయటకు వెళ్లే ద్వారం(ఎగ్జిట్‌) వద్ద 124 మీటర్ల పొడవుతో వాల్‌ పనులు పూర్తయ్యాయి. అయితే మిషన్‌భగీరథ, ఇతర పైప్‌లైన్లు ఉండడంతో పనులకు అడ్డంకి మారుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసి ఆర్‌యూబీని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.

–కరుణాకర్‌, రైల్వే జేఈ

అందరికీ ఇబ్బందులే..

ఆర్‌యూబీ పనులు వేగవంతంగా జరగటం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు కార్యాలయాలకు, పింఛన్ల కోసం వృద్ధులు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా అధికారులు శ్రద్ధ చూపాలి.

–తునికి దశరథ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, ఆర్‌యూబీ నిర్వాసితుల సమితి కన్వీనర్‌

ఆలేరు: ఆవలి వైపు వెళ్లడానికి పట్టుమని పది మీటర్ల దూరం ఉండదు. కానీ, రెండు కిలోమీటర్ల ప్రయాణిస్తే తప్ప అక్కడికి చేరుకోలేం. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో రైల్వేగేట్‌ స్థానంలో చేపట్టిన రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ) నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వల్ల పట్టణాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం మరో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ 60 శాతం కూడా పూర్తికాలేదు.

2019 అక్టోబర్‌లో పనులు మొదలు

ఆలేరు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌(గేట్‌) మీదుగా హైదరాబాద్‌ – వరంగల్‌ల మధ్య రైళ్ల రాకపోకల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ నిత్యం గేట్‌ పడటం వల్ల ప్రజలు ఆర్‌ఓబీ మీదుగా 2కి.మీ చుట్టూ తిరిగి పట్టణంలోకి రావాల్సిన పరిస్థితి. నాయకులు, స్థానిక ప్రజలు ఆందోళన నేపథ్యంలో ఆర్‌యూబీ మంజూరైంది. 2019 అక్టోబర్‌లో పనులు ప్రారంభం అయ్యాయి. మొదట రూ.11కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే భూ నిర్వాసితులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నందున ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.13 కోట్లకు పెంచారు.

అత్యవసర సమయంలో..

అంత్యక్రియలసమయంలో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. రైల్వేగేట్‌ అవలి వైపు నుంచి హైదరాబాద్‌ మార్గంలోని శ్మశానవాటికకు పార్థీవదేహాన్ని తరలించడం, అక్కడికి కుటుంబ సభ్యులు రావడానికి ప్రయాస పడాల్సిన పరిస్థితి. అత్యవసర వైద్యసేవల కోసం గర్భిణులు, వృద్ధులు ఆస్పత్రికి వెళ్లడానికి కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌ చుట్టూ తిరిగి, పట్టణంలోకి రావడం, లేదా బాధితుని ఇంటికి వెళ్లడానికి ఆలస్యమవుతుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవతోంది. తద్వారా సకాలంలో రోగులకు చికిత్స అందక ప్రాణాపాయ పరిస్థితులకు కారణమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఫ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

ఫ చుట్టూ తిరిగి వెళ్లలేక

రైలు పట్టాలపైనుంచే వెళ్తున్న ప్రజలు

ఫ రూ.13 కోట్ల వ్యయంతో పనులు

మూడు నెలలే గడువు పనులేమో కదలవు!1
1/1

మూడు నెలలే గడువు పనులేమో కదలవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement