
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికే ‘భూ భారతి’
యాదగిరిగుట్ట : రెవెన్యూ వ్యవస్థను బలోపేతానికి చేయడమే భూ భారతి పోర్టల్ ఉద్దేశమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. భూ భారతి చట్టంపై యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి ఆధార్లాగా ప్రతి రైతు భూమికి ప్రభుత్వం భూధార్ కార్డు జారీ చేస్తుందన్నారు. భూ రికార్డుల్లో మార్చి ప్రభుత్వ, భూధాన్, అసైన్డ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసే అధికారం సీసీఎల్ఏకు ఉంటుందన్నారు. ధరణి వల్ల భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ భూ భారతి చట్టంతో సులభంగా పరిష్కారం అవుతాయన్నారు. అంతకు ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, భూభారతి చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇంచార్జ్ తహసీల్ధార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ నవీన్కుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ అయిలయ్య