సేంద్రియ ఎరువులే పంటకు బలం | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఎరువులే పంటకు బలం

Apr 30 2025 5:18 AM | Updated on Apr 30 2025 5:18 AM

సేంద్

సేంద్రియ ఎరువులే పంటకు బలం

ఉపయోగాలు ఇవే..

సేంద్రియ ఎరువుల వినియోగంతో నేలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సేంద్రియ పదార్థం భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు కూడా ఇంకుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరిస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువకాలం పట్టి ఉంచుకొని పంటను బెట్టకు గురికాకుండా చేస్తుంది. అలాగే నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేందుకు తోడ్పడే సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.

నడిగూడెం : మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులను పంటలకు తక్కువ మంది రైతులు వినియోగిస్తుంటారు. అయితే సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటలకు చాలా ఉపయోగం. చాలా వరకు పంటలకు పురుగులు, తెగుళ్లు తగ్గడంతోపాటు, పురుగు మందు ఖర్చూ తగ్గుతుందని పలు పరిశోధనల్లోనూ, కొందరు రైతులు తమస్వీయ పర్యవేక్షణలో తెలుసుకున్నారు. అందుకే చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ సాగుపై నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్‌ సూచనలు.

పశువుల ఎరువు

పశువుల ఎరువు రైతులు అనాదిగా వినియోగిస్తున్న ఎరువే. అయితే రాను రాను వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పశు సంతతి తగ్గి పశువుల ఎరువు అందుబాటులో లేకుండా పోయింది. పంటలకు ఉపయోగించే ఎరువుల్లో ఇది చాలా ముఖ్యమైంది. ప్రాథమికంగా పశువుల ఎరువు ఏ పంట సాగులోనైనా వేసి తీరాల్సిందే. పంటలకు పోషకాలను అందించడంతో పాటు పొలంలో కురిసిన వాన నీటిని ఒడిసి పట్టి పంటలకు అందించడంలో పశువుల పేడ కీలక పాత్ర పోషిస్తుంది. మిగతా ఎరువులను పంటకు అందించాలన్నా ఈ ఎరువు తరువాత ఏదైనా పొలంలో ఒక వరుస మట్టి, ఆ తరువాత పశువుల ఎరువు మరో పొరమట్టి, పశువుల ఎరువు ఇంకో పొర ఆకులు, అలములు, పశువుల మేత వేయగా తొక్కి పడేసిన చెత్త చెదారాలను తొలకరి వర్షాలు కురవగానే వెంటనే ఆ కుప్పలోని ఎరువు మట్టిని చిన్నచిన్న కుప్పలుగా పోసి పొలమంతా చల్లితే మంచి ఫలితం ఉంటుంది.

కంపోస్టు ఎరువు

గ్రామాల్లో లభ్యమయ్యే చెత్త, రాలిన ఆకులు, ఇతర కలుపు మొక్కలు కుళ్లి కూరగాయలు, వేరుశనగ కాయల పొట్టును కలిపి పశువుల పేడ, మూత్రంతో కుప్పగా వేసి, కుళ్లింపజేస్తే కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఇలా చేయడం వల్ల సేంద్రియ ఎరువు బాగా కుళ్లిపోతుంది. దీనిని కూరగాయల పంటలకు, ఇతర పంటలకు వేస్తే మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు, చీడ పీడలు లేకుండా ఆశించిన దిగుబడి వస్తుంది.

కోళ్ల ఎరువు

కోళ్ల ఫారాల్లో కోళ్ల కింద వేసిన పొట్టు, మల మూత్రాలతో సేంద్రియ ఎరువు తయారవుతుంది. దాదాపు 40 కోళ్ల నుంచి ఏడాదికి టన్ను ఎరువు వస్తుంది. ఈ కోళ్ల ఎరువులో 3 శాతం నత్రజని, 2 శాతం భాస్వరం, 2 శాతం పొటాష్‌ పోషకాలు ఉంటాయి. తేమ తగ్గేకొద్ది పోషక శాతం పెరుగుతుంది.

పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల

ఎరువుతో అధిక దిగుబడులు

సేంద్రియ ఎరువులే పంటకు బలం1
1/1

సేంద్రియ ఎరువులే పంటకు బలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement