భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ

Apr 29 2025 10:05 AM | Updated on Apr 29 2025 10:05 AM

భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ

భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ

చౌటుప్పల్‌ : పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రమదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ బి.రాజగోపాల్‌రావు, జాయింట్‌ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వై.మోహన్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్‌ డే ఫర్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ ఎట్‌ వర్క్‌–2025ను పురస్కరించుకొని నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భద్రత అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చౌటుప్పల్‌పట్టణ పరిధిలోని లింగోజిగూడెంలోని దివీస్‌ పరిశ్రమ ఉద్యోగులు సేఫ్రీ డ్రాయింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి, సేఫ్టీ పద్య పోటీల్లో ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. బహుమతుల ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. భద్రత విషయంలో రాజీపడద్దన్నారు. భద్రత ప్రమాణాలు పాటించడం వల్ల కంపెనీ ఉత్పత్తులు పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. బహుమతులు సాధించిన దివీస్‌ ఉద్యోగులను వారు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement