
హోరాహోరీగా ఎద్దుల పందేలు
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో రెండో రోజైన ఆదివారం సాయంత్రం ఆరు పండ్ల విభాగంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు కొనసాగాయి. అదేవిధంగా శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు జరిగిన నాలుగు పండ్ల విభాగంలో గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గిత్తలు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. రెండో బహుమతిని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తుర్లపాడుకు చెందిన మనివిరెడ్డి ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. మూడో బహుమతి కృష్ణా జిల్లా మల్లపల్లికి చెందిన అక్కినేని సాన్విచౌదరి గిత్తలు గెలుపొందాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతితో పాటు షీల్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, నాయకులు ఆదూరి కిషోర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, టీఆర్బాలశౌరిరెడ్డి, గాలి చిన్నపురెడ్డి, గాదె లూర్ధుమారెడ్డి, పవన్రెడ్డి, బాలరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, రాజేష్రెడ్డి, అఖిల్రెడ్డి, రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.