
ఆర్టీసీ బస్ టిక్కెట్పై తప్పుడు తేదీ, సమయం ముద్రణ
మోత్కూరు: ఆర్టీసీ బస్సులో జారీ చేసే టిక్కెట్లపై తప్పుడు తేదీ, సమయం ముద్రించడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మోత్కూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూదగాని యాదగిరి తన భార్యతో కలిసి ఆదివారం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 03 జెడ్ 0457) ఎక్కారు. అక్కడి నుంచి మోత్కూరు వరకు రెండు బస్ టిక్కెట్లు తీసుకున్నారు. ఒక్కోటి రూ.190తో ముద్రించిన టిక్కెట్ను డ్రైవర్ యాదగిరికి ఇవ్వగా.. దానిపై తేది: 02–10–68, సమయం: 8.37నిమిషాలుగా ముద్రించి ఉండటం గమనించి డ్రైవర్ను అడగగా.. టిక్కెట్లు ఇచ్చే మిషన్లో అలాగే వస్తుందని డ్రైవర్ యాదగిరికి సమాధానం ఇచ్చాడు. తాము ప్రయాణించిన బస్సు ఏదైనా ఊహించని ప్రమాదానికి గురైతే తమకు ఎలా ఆధారం అని, టిక్కెట్పై తేదీ, సమయం తప్పుగా ముద్రిస్తే ఎలా అని యాదగిరి అంటున్నారు.