
హరిత హననం!
అడవులు, పొలాలు, రోడ్ల వెంట భారీ వృక్షాలు నరికివేత
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు హరితహారం, వన మహోత్సవం పేరుతో నాటిన లక్షల కొద్దీ మొక్కలు బొగ్గవుతున్నాయి. ఎదిగిన చెట్లను అక్రమార్కులు తమ స్వార్థం కోసం నరికి బొగ్గుబట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడవులతోపాటు పొలాలు, రహదారుల వెంట ఉన్న భారీ వృక్షాలు గొడ్డలి వేటకు గురవుతున్నాయి. ఫలితంగా కోట్లాది మొక్కలు నాటినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన బొగ్గు బట్టీలు విచ్చలవిడిగా రాజుకుంటున్నా అధికారులు నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.నెలనెలా లక్షలాది రూపాయలు చేతులు మారడమేనన్న ఆరోపణలున్నాయి.
ఎదిగిన చెట్లు ఎదిగినట్లే నరికివేత..
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24నుంచి 33 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేలు, నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున మొక్కలు నాటుతున్నారు. 10 విడతలుగా చేపట్టిన హరితహారం, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు 6 కోట్ల వరకు మొక్కలు నాటారు. అందులో మొదటి ఆరు విడతల్లో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. ఎదిగిన చెట్లను ఎప్పటికప్పుడు నరికి బొగ్గు బట్టీలకు తరలిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు
అటవీ శాఖ ఇచ్చిన అనుమతులను కాదని బట్టీల్లో విలువైన కర్రను కాల్చి బొగ్గు చేస్తున్నారు.సర్కారు తుమ్మకు మాత్రమే బొగ్గు బట్టీలకు అనుమతి ఉంది. కానీ వేప, చింత, కానుగు, మోదుగు ఇలా ప్రతి చెట్టు బట్టీల్లో కాల్చేస్తున్నారు. మోత్కూరు మండలం పనకబండ, దత్తప్పగూడెం, దాచారం, కమ్మగూడెం,అనాజిపురం, సూరారం, అడ్డగూడూరు మండలం అజీంపేట, లక్ష్మ్మీదేవికాలువ, వెల్దేవి, మానాయికుంట, గుండాల మండలం వెల్మజాల, వస్తాకొండూరు, మరిపడగ, మోటకొండూరు మండలం బొగ్గుబట్టీలు అధికంగా ఉన్నాయి.
కమిటీలు ఎక్కడ?
సహజ వనరులకు సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ, వీఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన కమిటీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే కలపను నరికి సొమ్ము చేసుకుంటున్నారు.
రైల్వే బొగ్గు కంటే చౌక
కర్ర బొగ్గు రైల్వే బొగ్గు కంటే తక్కువ ధరకు లభిస్తోంది. బొగ్గు తయారైన అనంతరం సంచుల్లో నింపి హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరుతో పాటు ఒడిశాకు లారీల ద్వారా తరలిస్తున్నారు. రైల్వే బొగ్గు కంటే చౌకగా లభిస్తుండడంతో కర్ర బొగ్గును ఆర్డర్లపై కొనుగోలు చేస్తారు. వివిధ కంపెనీలు, హోటళ్లలకు కర్ర బొగ్గు సరఫరా చేస్తున్నారు.
నాటిన మొక్కలు విడతల వారీగా (లక్షల్లో)
విడత సంవత్సరం మొక్కలు
మొదటి 2015 33.627
రెండవ 2016 73.038
మూడవ 2017 114.98
నాల్గవ 2018 85.948
ఐదవ 2019 70.11
ఆరవ 2020 49.62
ఏడవ 2021 27.82
ఎనిమిదవ 2022 30.89
తొమ్మిదవ 2023 22.99
హరితహారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు
గత ప్రభుత్వ హయాంలో పది విడతలుగా హరితహారం నిర్వహించగా సుమారు 5.85 కోట్ల మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 11.45 లక్షల మొక్కలు నాటారు. అందులో చాలా చెట్లు కనుమరుగయ్యాయి.
న్యూస్రీల్
ఫ బొగ్గుబట్టీలకు తరలుతోన్న కలప
ఫ ఓవైపు నాటుడు.. మరోవైపు నరుకుడు
ఫ దెబ్బతింటున్న పర్యావరణం
ఫ నిర్లిప్తంగా అటవీశాఖ అధికారులు

హరిత హననం!

హరిత హననం!

హరిత హననం!