బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను సక్సెస్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను సక్సెస్‌ చేయాలి

Mar 22 2025 1:37 AM | Updated on Mar 22 2025 1:33 AM

సాక్షి, యాదాద్రి: హన్మకొండలో వచ్చేనెలలో జరిగే బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్టీ శ్రేణులను పెద్దఎత్తున తరలించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మాజీ ఎమ్మెల్యేలకు సూచించారు. శుక్రవారం ఎర్రవెళ్లిలోని ఫాం హౌస్‌లో కేసీఆర్‌ను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌లు కలిశారు. ఈసందర్భంగా హన్మకొండకు దగ్గరలో ఉన్న జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ కోసం చర్చించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టే జన సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌ వారికి దిశా నిర్దేశం చేశారు. వేడుకలకు ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పదివేల మంది వరకు పార్టీ శ్రేణులను తరలివస్తారని కేసీఆర్‌కు వివరించారు.

ఫ ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ

శ్రేణులను తరలించాలని

మాజీ సీఎం కేసీఆర్‌ సూచన

ఫ ఎర్రవెళ్లి ఫాం హౌస్‌లో

ఆయనను కలిసిన బీఆర్‌ఎస్‌

మాజీ ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement