కర్రసాములో ఏపీ చాంపియన్షిప్
దెందులూరు: కర్రసాములో ఏపీ చాంపియన్షిష్ – 2025 సింగల్ స్టిక్ (కర్ర) పోటీ విభాగంలో వేగవరం గ్రామానికి చెందిన మోర్ల భగత్ సామ్రాట్ గోల్డ్ మెడల్ సాధించాడు. గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన ఏపీ సౌత్ జోన్ సేలాంబం చాంపియన్షిప్–2025 లో భగత్ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి చాంపియన్షిప్ సాధించడం పట్ల కోచ్ వెంకన్న పలువురు అతడిని అభినందించారు.
భీమడోలు: స్థానిక భీమడోలు పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి వివాహిత ఫిర్యాదు మేరకు గృహహింస కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సూరప్పగూడెంకు చెందిన వినీలకు, ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నిర్మల సురేష్తో 15 ఏళ్ల కితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఈ ఏడాది జనవరి 28వ తేదీన సురేష్ అనుమానంతో వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశాడని, ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించారని వినీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె అక్కడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం భీమడోలు పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడంతో సురేష్తో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపారు.
కర్రసాములో ఏపీ చాంపియన్షిప్


