రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ

Dec 10 2025 7:26 AM | Updated on Dec 10 2025 7:26 AM

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ

తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు గాను రాజమహేంద్రవరంలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యానవర్సిటీ మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఉద్యాన ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఈ రంగంలో అభివృద్ధి సాధించడానికి ఎంఓయూ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అరటి ఆకుల ఎకో పైబర్‌, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, జీడిపప్పు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు, కె.ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement