వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం | - | Sakshi
Sakshi News home page

వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం

Nov 28 2025 7:09 AM | Updated on Nov 28 2025 7:09 AM

వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం

వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం

మైలవరం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్‌బాల్‌ లీగ్‌ పోటీలు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోని డాక్టర్‌ లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో కొల్లేరు, వంశధార జట్లు తలపడ్డాయి. కొల్లేరు 4–1 గోల్స్‌ తేడాతో వంశధారపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లకు ముఖ్యఅతిథులుగా డైరెక్టర్‌, ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ పర్వతనేని సుభాష్‌బాబు, ఏరియా లీడర్‌ మూలుపూరి ఉపేంద్ర, ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ జి.రవీంద్ర రానా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తరఫున వై.శేషగిరిరావు, బి.చక్రవర్తి, జి.ఎస్‌.ఎస్‌ పవన్‌కుమార్‌, పండరి శ్రీనివాస్‌ పోటీలను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement