కొనసాగుతున్న గోదావరి వరద | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న గోదావరి వరద

Sep 5 2025 7:39 AM | Updated on Sep 5 2025 7:39 AM

కొనసా

కొనసాగుతున్న గోదావరి వరద

కొనసాగుతున్న గోదావరి వరద విధులకు దూరంగా ఆప్కాస్‌ ఆపరేటర్‌ యూరియా నిల్వల తనిఖీ ఒకేచోట ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భీమవరం: జిల్లా కలెక్టరేట్‌ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో విశాలమైన పార్కింగ్‌ స్థలం, అన్ని శాఖల కార్యాలయాలూ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గురువారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌ నిర్మాణంపై జరుగుతున్న చర్చపై స్పందించారు. కలెక్టరేట్‌ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అని, అది ఎక్కడ నిర్మిస్తారనే అనవసరమైన ఆందోళన అవసరం లేదని అన్నారు. కలెక్టరేట్‌ నిర్మాణ విషయంలో రాజకీయాలకు, ప్రతిష్టకు తావులేదని, రాజకీయపరమైన అభిప్రాయాలకు తావు లేదని స్పష్టం చేశారు. నరసాపురం నుంచి చైన్నె వరకు వందే భారత్‌ రైలు పొడిగింపుపై ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా జిల్లాలో అభివృద్ధి చేస్తున్న భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం స్టేషన్లకు మరో రూ.18 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రధాన కార్యదర్శి సమీక్ష భీమవరం(ప్రకాశంచౌక్‌): మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు, భుగర్భ జలాలు, పీఎం కుసుమ్‌, కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్లు, సోలార్‌/విండ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, స్వచ్ఛాంధ్ర అవార్డులు అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వీడి యో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్‌ నుంచి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్‌రేవు, లలితాంబ ఘాట్‌, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్‌ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి. మాధవాయిపాలెంలో పంటు రాకపోకలు పునరుద్ధరించలేదు. వారం రోజులుగా పంటు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

తాడేపల్లిగూడెం: ‘ఆప్కాస్‌ ఆపరేటర్‌ లైంగిక వేధింపులు’ శీర్షికన ఈనెల 1న ప్రచురించిన కథనానికి తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏసుబాబు స్పందించారు. ఆప్కాస్‌ ఆపరేటర్‌ బాలాను ప్రస్తుతానికి విధులకు దూరంగా ఉంచామని, లైంగిక వేఽధింపుల వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చడానికి ఒక అధికారిని నియమిస్తున్నామన్నారు. సదరు అధి కారి నివేదిక వచ్చిన తర్వాత ఆపరేటర్‌ను కా ర్యాలయ విధుల నుంచి బయట విధులను నియమించే అవకాశం ఉందన్నారు. అప్పటికీ బాలా ప్రవర్తనలో మార్పు రాని పక్షంలో విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని, నిబంధనల మేరకు జిల్లా ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు.

వీరవాసరం: రైతులు యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత సార్వా పంటలో ఎంత యూరియా అవసరమైందో అంతే ప్రస్తుతం కూడా నిల్వలు ఉంచామని చెప్పారు. వీరవాసరంలో గురువారం ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ గోడౌన్లను తనిఖీ చేశారు. వ్యవసాయ అనుబంధ పంటలకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. రైతు వ్యవసాయ విస్తీర్ణం బట్టి యూరియా ఇవ్వాలని సొసైటీలకు సూచించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ రామాంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి బిన్సీ బాబు ఉన్నారు.

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

కొనసాగుతున్న గోదావరి వరద 
1
1/1

కొనసాగుతున్న గోదావరి వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement