
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని.. క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 15 మంది గర్భిణిలకు సామూహిక సీమంతం నిర్వహించి, పండ్ల కిట్ను అందజేశారు. అనంతరం పౌష్టికాహార పక్షోత్సవ సమాచార గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లా వైద్య శాఖ అధికారి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.