అర్జీలు త్వరగా పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరగా పరిష్కరించండి

Dec 30 2025 6:55 AM | Updated on Dec 30 2025 6:55 AM

అర్జీలు త్వరగా పరిష్కరించండి

అర్జీలు త్వరగా పరిష్కరించండి

అర్జీలు త్వరగా పరిష్కరించండి

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 167 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement