సింహగర్జన సభను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సింహగర్జన సభను విజయవంతం చేయాలి

Dec 29 2025 7:26 AM | Updated on Dec 29 2025 7:26 AM

సింహగర్జన సభను విజయవంతం చేయాలి

సింహగర్జన సభను విజయవంతం చేయాలి

నర్సంపేట: ఓసీ సింహగర్జన బహిరంగ సభకు రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రెడ్డి సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షుడు కంది గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ, నూతన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మదాపురం, మధిర, బుధరావుపేట, గోపాలపురం, చెన్నారావుపేట, ముదిగొండ గ్రామాల సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిని జైపాల్‌రెడ్డితో పాటు జగిత్యాల జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మొట్ల వెంకటరమణారెడ్డి, నర్సంపేట అసిస్టెంట్‌ కమిషనర్‌ పోలీస్‌ పున్నం రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ అండ్రు రాజేంద్రప్రసాద్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 11వ తేదీన నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్‌రెడ్డి, ఎర్ర యాకుబ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, మొట్ల లావణ్య, గోగుల శ్రీనివాస్‌రెడ్డికోమల, కటుకూరి వీరారెడ్డి, పరుపాటి పద్మారఘుపతిరెడ్డి, శ్వేతాచైతన్యరెడ్డి, పొన్నం రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement