డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
● మీ డబ్బు–మీ హక్కు కార్యక్రమానికి
స్పందన
న్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లైయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్కై ్లయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్లు పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లయిమ్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీ అండ్ బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటీవ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


