భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడిపూజ
నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్గుప్తా ఆధ్వర్యంలో 39వ రోజు సోమవారం మహా అన్నదాన ప్రసాద వితరణ, దివ్య పడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో గీతాంజలి స్కూల్ చైర్మన్ వేములపల్లి జయశ్రీసుబ్బారావు, అపర్ణ రాహుల్చౌదరి, అక్షిభక్తుల రచనచౌదరి, బాలాజీ, సాయివిశ్వనాథ్, డాక్టర్ సాయిసుప్రీత్, కరణ్, దొడ్డ సాయిలు పాల్గొనగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, కోశాధికారి దొడ్డ రవీందర్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


