
సమస్యలు పరిష్కరిస్తాం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు. ఈనెల 12న ఐదేళ్ల లాకోర్సుల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులతో శనివారం పరిపాలనాభవనం వద్ద చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు వినకుండా పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. మళ్లీ కొంతసేపటికి రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులతో మాట్లాడారు. వీసీ ప్రతాప్రెడ్డి ఈనెల 23న కేయూకు రానున్నారని సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ రామచంద్రంకు అందజేశారు. రిజిస్ట్రార్ వెంట పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్, కేయూ పాలకమండలి సభ్యులు బి.సురేశ్లాల్, లా హాస్టల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. కేయూ పోలీస్టేషన్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి విచ్చేశారు.
ఎంజీఎం: ఈనెల 17 నుంచి జిల్లావ్యాప్తంగా ‘స్వస్త్నారీ సశక్తి పరివార్’ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. శనివారం కలెక్టర్లోని ఐడీఓసీ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యాధికారులు, టీబీ నోడల్ పర్సన్స్, హెల్త్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. 17 నుంచి ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో ఆప్రాంతంలోని మహిళలను పరీక్ష శిబిరాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈశిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి తగిన పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లార్వా నియంత్రణ చర్యలు, ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. టీబీ ముక్త్భారత్ అభియాన్ 8 రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్, ఎక్స్రే పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హేమబిందు, అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం