తెల్లబోతున్నారు..! | - | Sakshi
Sakshi News home page

తెల్లబోతున్నారు..!

Nov 18 2025 8:38 AM | Updated on Nov 18 2025 8:38 AM

తెల్ల

తెల్లబోతున్నారు..!

సీసీఐ కొర్రీలు.. కొనుగోళ్ల బంద్‌తో చిక్కులు

నిలిచిన కొనుగోళ్లు..పలు చోట్ల ఆందోళనలు

జిన్నింగ్‌ వ్యాపారుల బంద్‌తో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు జిన్నింగ్‌ మిల్లుల వద్ద పత్తి వాహనాలు భారీగా క్యూ కడుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.

● నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్‌ గేట్‌ వద్ద ఎన్‌హెచ్‌–167పై రైతులు ధర్నాకు దిగారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌ నాయకుడు, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు.

● జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులు మధ్యాహ్యం సమయంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయుడు సాయంత్రం సెంటర్‌ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి కొనుగోలు చేసేలా మిల్లు యజమానిని ఒప్పించారు. దీంతో రాత్రి వరకు ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగగా.. రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు.

తెల్లబోతున్నారు..!1
1/3

తెల్లబోతున్నారు..!

తెల్లబోతున్నారు..!2
2/3

తెల్లబోతున్నారు..!

తెల్లబోతున్నారు..!3
3/3

తెల్లబోతున్నారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement