మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు

Oct 20 2025 9:40 AM | Updated on Oct 20 2025 9:40 AM

మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు

మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు

ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ

27న లక్కీడిప్‌ ద్వారా దుకాణాల కేటాయింపు

మహబూబ్‌నగర్‌ క్రైం: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ శనివారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించగా ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 5,183 దరఖాస్తులు వచ్చాయి. అయితే 2023 సంవత్సరంలో చేసిన టెండర్ల ప్రక్రియ కంటే ఈసారి దరఖాస్తులు గణనీయంగా తగ్గడంతో మరోసారి గడువు పెంచారు. ఈ నెల 23 వరకు టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఈ నెల 27న కలెక్టరేట్‌లో లక్కీ డిప్‌ ద్వారా దుకాణాల కేటాయింపు చేయనున్నారు. మద్యం వ్యాపారులకు మరో మూడు రోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిసి వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కొంత మేర టెండర్లు పెరగవచ్చని ఎకై ్సజ్‌ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement