‘ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’

Apr 21 2025 12:59 AM | Updated on Apr 21 2025 12:59 AM

‘ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’

‘ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’

పాన్‌గల్‌: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని దావాజిపల్లి, మాందాపూర్‌, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో విండో వైస్‌ చైర్మన్‌ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement