
మరింత ప్రోత్సాహం అందించాలి
మాకు ఆరు బర్రెలు ఉన్నాయి. వీటి నుంచి పాలు సేకరించి హోటళ్లు, గృహాలకు అందించి వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నా. రోజుకు 10నుంచి 15లీటర్ల పాల వరకు విక్రయిస్తాను. మాలాంటి సన్నకారు రైతులకు, కొత్తగా ఈ రంగం వైపు వచ్చే యువతకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. బర్రెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం లేదా బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తే బాగుంటుంది. చిన్నంబావి మండలంలో పాల కేంద్రం ఏర్పాటు చేస్తే పాడి రంగం వైపు మరింత మంది రైతులు వచ్చే అవకాశం ఉంది.
– వేముల శేఖర్గౌడ్,
పాడిరైతు, చిన్నంబావి, వనపర్తి జిల్లా