పనులు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

పనులు ముమ్మరం

Jun 4 2025 12:24 AM | Updated on Jun 4 2025 12:24 AM

పనులు

పనులు ముమ్మరం

జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న సీసీ నిర్మాణాలు

రోడ్డు వేయడం శుభ పరిణామం

శివారు ప్రాంతంగా ఉన్న మా కాలనీలో కొన్నేళ్లుగా మట్టి రోడ్డే ఉండేది. ఆ రోడ్డు కూడా గుంతలు, మిట్టలు ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. చాలా ఏళ్ల తర్వాత సీసీ రోడ్డు వేయడం శుభపరిణామం. ఈ ప్రాంతంలో రోడ్డు వేస్తారని అనుకోలేదు. – ఎరుకలి రాధ, నాగవరం

రహదారి మారింది..

మా కాలనీలో మురుగు అస్తవ్యస్తంగా రహదారిపై పారడంతో రాకపోకలకు ఇబ్బందులు పడేవాళ్లం. సమస్యను ప్రజా ప్రతినిధు లు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. పుర మాజీ వైస్‌ చైర్మన్‌ పాకనాటి కృష్ణ చొరవతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు వేస్తున్నారు. – మణెమ్మ, ప్యాటగడ్డ

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..

ప్రతి కాలనీలో అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు మెరుగుపడితే ప్రజలకు కనీస సౌకర్యాలు అందిన ట్లు అవుతాయి. హంగామా కోసం నాలుగు లైట్లు వేసి ఇదే అభివృద్ధి అనడం మా విధానం కాదు. పట్టణాభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.

– మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి

వనపర్తి టౌన్‌: జిల్లాకేంద్రంలోని అంతర్గత రహదారులన్నీ సీసీ హంగులు సంతరించుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 33 వార్డులు, 68 కాలనీల్లో సుమారు 40 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, డ్రెయినేజీల పనులు నెలరోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.44 కోట్లతో పుర పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ రహదారులు, డ్రెయినేజీల నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 25న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో వార్డుకు అభివృద్ధి ప్రాధాన్యత ఆధారంగా రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు కేటాయించి రోడ్లు, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. పుర విలీన గ్రామాలైన శ్రీనివాసపురం, మర్రికుంట, రాజనగరం, నాగవరం, నర్సింగాయపల్లిలోనూ పనులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో చిట్యాల, రాజపేట, పెద్దగూడెం, పీర్లగుట్ట. అప్పాయిపల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణం చేపట్టలేదు. ఆయా ప్రాంతాల్లోనూ సీసీ రహదారులు నిర్మిస్తుండటంతో పట్టణంలోని ఏ కాలనీలో చూసినా సీసీ రోడ్లే దర్శనమిస్తున్నాయి. పాతకాలనీలో గతంలో వేసిన సీసీ రహదారులు దెబ్బతింటే వాటిని కూడా తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు.

డ్రెయినేజీల నిర్మాణం..

పుర కేంద్రంలో ప్రస్తుతం ఏటవాలుగా ఉన్న వరద కాల్వకు అనుసంధానంగా మరో మూడు కిలోమీటర్లు, వివిధ కాలనీల్లో 17 కిలోమీటర్ల సీసీ డ్రెయినేజీలను నిర్మిస్తున్నారు. రహదారికి ఇరువైపులా, మరికొన్నిచోట్ల ఒకవైపున నిర్మిస్తున్న డ్రెయినేజీలను అడుగు నుంచి రెండు అడుగుల మేర లోతు మట్టిని తొలగిస్తుండటంతో మురుగు, వర్షపు నీరు సాఫీగా ముందుకు పారే ఆస్కారం ఉంటుంది.

23 కిలోమీటర్ల రహదారులు.. 17 కిలోమీటర్ల డ్రెయినేజీలు

టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.44 కోట్లతో..

‘డబుల్‌’ ఇళ్ల ప్రాంత అభివృద్ధికి రూ.8 కోట్లు

పనులు ముమ్మరం1
1/3

పనులు ముమ్మరం

పనులు ముమ్మరం2
2/3

పనులు ముమ్మరం

పనులు ముమ్మరం3
3/3

పనులు ముమ్మరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement