ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం

Jun 5 2025 2:11 AM | Updated on Jun 5 2025 2:11 AM

ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం

ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం

పాన్‌గల్‌/వీపనగండ్ల: తల్లిదండ్రులు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించి బడులను కాపాడాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య కోరారు. టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుదాం–ప్రభుత్వ బడులను కాపాడుదాం’ నినాదంతో నిర్వహిస్తున్న ప్రచార జాత బుధవారం పాన్‌గల్‌, వెంగళాయిపల్లి, వీపనగండ్ల మండలం కల్వరాల్ల, పుర్గర్‌చర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్‌, పాఠ్య, రాత పుస్తకాలు ఉచితంగా అందుతాయని, తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందన్నారు. ప్రైవేట్‌కు దీటుగా బోధన, సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి బడులను కాపాడేందుకు తోడ్పాటునందించాలని కోరారు. పాన్‌గల్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం నాయకులు హమీద్‌, గడ్డం మురళి, వెంకటేష్‌, తిమ్మప్ప, శ్రీనివాస్‌గౌడ్‌, కృష్ణమూర్తి, బాలయ్య, రాముడు, డీవైఎఫ్‌ఐ నాయకులు బాలరాజు, తహసీల్దార్‌ సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల నాయకుడు రాముయాదవ్‌, వీపనగండ్లలో జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా నాయకులు శ్రీనివాసులు, బాలీశ్వర్‌, సమీద్‌, అయోద్యరాముడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement