
ఆ.. 40లో ఉన్నదెవరు?
రాజోళి: రాజోళి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ప్యాక్టరీ వద్ద జరిగిన రగడ రోజురోజుకో మలుపు తిరుగుతుంది. బుధవారం ఫ్యాక్టరీ, వాహనాలపై దాడులు, కంటైనర్ తగలబెట్టిన ఘటనల్లో పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మందిని ఇప్పటికే రిమాండ్కు తరలించారు. తాజాగా మిగిలిన వారిపై కేసులు, రిమాండ్కు తరలిస్తారని తెలియడంతో పెద్దధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 మందిని రిమాండ్ పంపించగా అందులో ఒకరు చిన్నధన్వాడకు చెందిన వ్యక్తి ఉన్నాడు. మిగతా వారు పెద్దధన్వాడ గ్రామస్తులే. అయితే మిగిలిన 29 మందిలో ఏ గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారు? వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారనే ఆందోళన నెలకొంది. అసలు ఆ కేసుల్లో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారా, రైతులా, కూలీలా, మహిళలు ఉన్నారా అనే అనుమానాలు ఆయా గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. జైలుకు వెళితే రాజకీయ నాయకులు ఏదోలా బయటకు వస్తారు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అసలు 40 మందితోనే కేసులు ఆగుతాయా లేక వీడియోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు నమోదు చేస్తారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. చిన్నధన్వాడలో ఒక్కరిపైనే కేసు నమోదు కాగా.. మాన్దొడ్డి, నసనూరు, తుమ్మిళ్ల తదితర గ్రామాల్లో ఎవరిౖపైనెనా కేసులు నమోదు చేశారు అనే అనుమానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఒక జైలర్ శాఖకు సంబందించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నట్లు సమాచారం.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనలో
పలువురిపై పోలీసుల ప్రత్యేక నజర్
కొందరి స్వార్థంతో
అమాయక రైతులు బలయ్యారని వాదన
ఇప్పటికే 12 మంది రిమాండ్..
మరికొందరిపై కేసులు ?
ఆందోళనలో జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు