
పల్లెల్లో ‘ఇథనాల్’ చిచ్చు
ఊర చెరువును పరిశీలించిన లోకాయుక్త సభ్యులు
వనపర్తి రూరల్: మండలంలోని కిష్టగిరి శివారులో ఉన్న ఊర చెరువు అలుగు పెంచడంతో నీటినిల్వ పెరిగి పొలానికి వెళ్లడానికి దారి లేదని, నీరు తగ్గించాలని రైతు శ్రీనివాస్రెడ్డి లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం లోకాయుక్త సభ్యులు తిరుపతి వెంకట్రావు, విద్యాసాగర్ గ్రామంలోని రైతులు, ఫిర్యాదుదారుతో కలిసి చెరువు, ఆయకట్టును పరిశీలించారు. గతంలో తమ పొలానికి చెరువు ముందు నుంచి వెళ్లే వాళ్లమని బాధితుడు వివరించారు. అలుగు అప్పటిలాగే ఉందని.. ఎత్తు పెంచలేదని, నీటి నిల్వ తగ్గిస్తే పంటలు పండటం కష్టమని పలువురు రైతులు సభ్యులకు వివరించారు. వారి వెంట డీఈ మల్లయ్య, ఏడీ బాలకృష్ణ, ఆర్ఐ వెంకటేష్, సర్వేయర్లు భాస్కర్, సందీప్, అధికారులు ఉన్నారు.