
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : ఎస్పీ
వనపర్తి రూరల్: నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రాజపేట శివారు గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల పక్కన రూ.2.20 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం అందించేందుకు బంక్ ఏర్పాటు చేస్తున్నామని, పోలీసుశాఖ పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని, త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి, మిషన్ భగీరథ డీఈ విజయ్కుమార్, సైట్ ఇంజినీర్ నరేష్, ఏఆర్ ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.