
రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేత
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 15 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు.
నేడు విద్యుత్ గ్రీవెన్స్ డే
వనపర్తిటౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికిగాను గురువారం జిల్లాకేంద్రంలోని బాలానగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ (కన్స్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ ఫోరం), హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే కార్యక్రమానికి హాజరయ్యే వినియోగదారులు ఆధార్కార్డు, కరెంట్ బిల్లు రసీదులను వెంట తీసుకురావాలని సూచించారు. వనపర్తి సర్కిల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
డీఎంహెచ్ఓ
ఆకస్మిక తనిఖీ
వనపర్తి: జిల్లాకేంద్రంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్లను బుధవారం డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయిబాలాజీ పాలీక్లీనిక్ లైసెన్స్ పునరుద్ధరించుకోకపోవడంతో సీజ్ చేశారు. ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని.. పరిమితికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఎస్ఐలు జయన్న, రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి ఉన్నారు.
రూ.8.51 లక్షలు
పలికిన తైబజార్
ఆత్మకూర్: పుర కేంద్రంలోని తైబజార్ వేలం బుధవారం పుర కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ శశిధర్ వేలం నిర్వహించగా పట్టణానికి చెందిన కావలి కృష్ణ రూ.8,51,500 పాట పాడి దక్కించుకున్నారు. 25 శాతం చొప్పున నాలుగు విడతల్లో డబ్బులు చెల్లించాలని కాంట్రాక్టర్కు సూచించారు. వేలంలో ఇద్దరు పాల్గొన్నా రని వివరించారు. పుర సిబ్బంది పాల్గొన్నారు.

రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేత