గుంకలాంలో కార్డన్ సెర్చ్
● పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం
● అదుపులో ఎనిమిది మంది
అనుమానితులు
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గుంకలాం లే అవుట్లో డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది సిబ్బంది సోమవారం కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటూ అనుమానితులపై దృష్టి సారించారు. అనంతరం గ్రామస్తులతో డీఎస్పీ సమావేశమై అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్సైలు అశోక్, సాయికృష, సిబ్బంది మూర్తి, సునీత, దుర్గాప్రసాద్, లక్ష్మణరావు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.


