రాష్ట్ర పండగగా రాజాం పైడితల్లి జాతర | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పండగగా రాజాం పైడితల్లి జాతర

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

రాష్ట్ర పండగగా  రాజాం పైడితల్లి జాతర

రాష్ట్ర పండగగా రాజాం పైడితల్లి జాతర

ఈనెల 22 నుంచి ఉత్సవాలు

రాజాం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, రాజాంలోని పోలిపల్లి పైడితల్లి జాతరను రాష్ట్రస్థాయి పండగగా గుర్తిస్తూ దేవదాయ శాఖ బుధవారం జీఓ జారీ చేసింది. జాతర ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిపేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం రూ.50లక్షల నిధులను కేటాయించారు. మూడురోజులు పాటు ఆలయం వద్ద ఉచిత ప్రసాదం, అన్నదానం, విద్యుత్‌ అలంకరణ, సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పండగగా గుర్తించడంతో భక్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆలయానికి 2023లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం 6ఏ హోదా కల్పించడంతో ఆ స్థాయిలో జాతరకు అప్పట్లో ఏర్పాట్లు చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే శతవసంతాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, అమ్మవారి దర్శనానికి సుమారు 50వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు ఆలయ ఈఓ బి.వి.మాధవరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement