ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీలకు గరివిడి విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీలకు గరివిడి విద్యార్థుల ఎంపిక

Dec 17 2025 6:37 AM | Updated on Dec 17 2025 6:37 AM

ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీలకు గరివిడి విద్యార్థ

ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీలకు గరివిడి విద్యార్థ

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): గరివిడి ఎస్‌డీఎస్‌ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఎం.అజయ్‌, ఎస్‌.ప్రవల్లికలు ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీలో ఈ నెల 15న జరిగిన బేస్‌బాల్‌ టీమ్‌ సెలక్షన్‌లో ఈ విద్యార్ధులు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారు. తమ కళాశాల విద్యార్థులు ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ బేస్‌బాల్‌ పోటీలకు ఎంపిక కావడం పట్ల కరస్పాండెంట్‌ బి.రవి, ప్రిన్సిపాల్‌ డా.ఎ.రామకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.సురేష్‌కుమార్‌, పీడీ ఎం.భానుమూర్తి విద్యార్థులను మంగళవారం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement