
విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ గొంతునొక్కేందుకు చూస్తోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను జర్నలిస్టు వార్తగా రాస్తే కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం హక్కు అమలులో ఉందా?లేదా? అనే ఆందోళన కలుగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సమంజసం కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కూటమి పాలకుల తీరును గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి. – అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం

విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?