మహారాణిపేట: ఈ నెలాఖరుకు జిల్లాలోని ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జన గణన–2027 ప్రక్రియ మొదలవుతుందని, ఈ లోగా ఓటర్ల జాబితాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి అధికారులతో, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని ప్రక్రయను వేగవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


