చంద్రబాబు సర్కార్ ద్రోహం
ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇస్తామని ఊదరగొట్టిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక ఆ మాటలను తుంగలో తొక్కారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఆ హామీ ప్రస్తావనే లేదు. తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లోనైనా ఈ పథకానికి నిధులు కేటాయిస్తారనుకుంటే, అక్కడ కూడా మొండిచేయే ఎదురైంది. చంద్రబాబు సర్కారు ఈ పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేసి బడుగు, బలహీన వర్గాలను నిలువునా మోసం చేసింది. మాట తప్పినందుకు గాను భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
– కటుమూరి సతీష్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్


