కనుల పండువగా శ్రీవారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా శ్రీవారి కల్యాణం

Dec 14 2025 6:55 AM | Updated on Dec 14 2025 6:55 AM

కనుల పండువగా శ్రీవారి కల్యాణం

కనుల పండువగా శ్రీవారి కల్యాణం

పీఎం పాలెం: రెండు రోజులుగా జరుగుతున్న చైతన్య అన్నమయ్య మ్యూజిక్‌ అసోసియేషన్‌ సంగీత ఉత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. ముగింపు సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. నగరంలోని అధిక సంఖ్యలో భక్తులు ఈ కల్యాణానికి హాజరయ్యారు. అన్నమయ్య 12వ తరానికి చెందిన శ్రీమాన్‌ హరినామాచార్యులు హాజరు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. గోపినాంబల శేషాచార్య స్వామి వివాహ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కల్యాణం సందర్భంగా టీటీడీ ఏ గ్రేడ్‌ ఆస్థాన గాయకులు బి. రంగనాథ్‌, కె. సాయిశంకర్‌ అన్నమయ్య కీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు, కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైజాగ్‌ కన్వెన్షన్‌ ఎండీ నరసింహారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement