ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్‌చార్జి ఏపీపీగా రాజశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్‌చార్జి ఏపీపీగా రాజశేఖర్‌

Jul 27 2025 5:17 AM | Updated on Jul 27 2025 5:17 AM

ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్‌చార్జి ఏపీపీగా రాజశేఖర్‌

ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్‌చార్జి ఏపీపీగా రాజశేఖర్‌

విశాఖ లీగల్‌: నగరంలోని షెడ్యూల్‌ కులాలు, తెగల ప్రత్యేక న్యాయస్థానం ఇన్‌చార్జి అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ న్యాయవాది భత్తి రాజశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్‌ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌గా పని చేస్తున్నారు. ఈ కోర్టుతోపాటు ఎస్సీ, ఎస్టీ కోర్టులోని అన్ని క్రిమినల్‌ కేసులను ప్రాసిక్యూషన్‌ తరపున వాదిస్తారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏపీపీగా కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement