‘తొలి అడుగు’ బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘తొలి అడుగు’ బహిష్కరణ

Jul 4 2025 3:33 AM | Updated on Jul 4 2025 3:33 AM

‘తొలి అడుగు’ బహిష్కరణ

‘తొలి అడుగు’ బహిష్కరణ

కొమ్మాది: రుషికొండలో నిర్వహించిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని టీడీపీ వార్డు అధ్యక్షుడు చెట్టిపల్లి గోపి, ఆయన వర్గం బహిష్కరించింది. జీవీఎంసీ 8వ వార్డు రుషికొండలో గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అప్పటి వరకు ప్రజలు వర్షంలో తడుస్తూ ఆయన కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. కాగా.. వార్డులో నెలకొంటున్న రాజకీయాల పరిణామాల నేపథ్యంలో గోపి వర్గం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement