
ఈ ఏడాది 60 మంది ముందుకు..
పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి మొక్కుకునేవారు ఈ వేషాలు వేయడానికి ముందుకు వస్తారు. అభినయం అక్కరలేకపోయినప్పటికీ కేవలం వేషం ద్వారా గ్రామస్తులు, బంధువులను మెప్పిస్తుంటారు. వేసిన పౌరాణిక పాత్రలో ఒదిగిపోతారు. కళాకారులు ఎక్కువైతే పలువురు ఒకే పాత్రలో అలరిస్తుంటారు. ఈ ఏడాది ముచ్చర్ల ఉత్సవ కమిటీ ఈ నేలవేషాలకు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తుంది. ఎండ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు ప్రవేశించినా గత వైభవానికి తగ్గకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన అనుపోత్సవంలో 60 మంది వరకు నేలవేషగాళ్లు అలరించారు. వీరిని చూడటానికే చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ముచ్చర్ల తరలివచ్చారు.
●