
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
తాటిచెట్లపాలెం: డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్యూసీసీ) 2025 తొలి సమావేశం మంగళవారం దొండపర్తిలోని డీఆర్ఎం కా ర్యాలయంలో జరిగింది. డీఆర్ఎం కార్యాలయం వద్ద గల కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఎం లలిత్బోరా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, కల్చరల్ అసోసియేషన్, ప్రయాణికుల అసోసియేషన్ ప్రతినిధులు, నామినేటెడ్ సభ్యులు మొత్తం 11 మంది ఈ సమావేశంలో పాల్గొని ప్రయాణికుల సౌకర్యాలు, సమస్యల గురించి చర్చించారు. పలు స్టేషన్ల్లో దివ్యాంగులకు మెరుగైన సదుపాయాలు, ప్రత్యేక రైళ్లు నడపాలని, రైళ్లు ఫ్రీక్వెన్సీ మరింత పెంచాలని, అదనపు ప్లాట్ఫారాలను నిర్మించాలని ప్రతినిధులు కోరారు. వీటికి స్పందించిన డీఆర్ఎం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంలో భారతీయ రైల్వే నిరంతర కృషి చేస్తుందని తెలిపారు.