గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నేడు | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నేడు

Jun 25 2025 7:16 AM | Updated on Jun 25 2025 7:16 AM

గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నేడు

గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నేడు

సబ్బవరం: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి బుధవారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయాధికారి ఎన్‌. రామకృష్ణ తెలిపారు. బాలికలకు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులంలో, బాలురకు విశాఖ జిల్లా శ్రీకృష్ణాపురంలోని బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులంలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6, 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, 8, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సమన్వయాధికారి రామకృష్ణ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement