ఇది హృదయ విదారక ఘటన | - | Sakshi
Sakshi News home page

ఇది హృదయ విదారక ఘటన

Jun 13 2025 4:39 AM | Updated on Jun 13 2025 4:39 AM

ఇది హృదయ విదారక ఘటన

ఇది హృదయ విదారక ఘటన

విమాన ప్రమాద మృతులకు

మాజీ మంత్రి అమర్‌నాథ్‌ సంతాపం

సాక్షి, విశాఖపట్నం : అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. ఇది తమను ఎంతో బాధించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకుల దుఃఖాన్ని ఊహించడం కష్టమని.. అందరికీ తట్టుకునే బలాన్ని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ముఖ్య నేతలు పేర్ల విజయచందర్‌, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజబాబు, పీతల గోవింద్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement