
కుమ్మేసిన వర్షం
ఆరిలోవ: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్రమైన ఎండతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అయితే కొన్ని చోట్ల గాలివాన బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవీఎంసీ 9వ వార్డు విశాలాక్షినగర్, ఎంవీపీ డబుల్రోడ్డులో చెట్లు నేలకూలాయి. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. శానిటరీ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగించారు. మద్దిలపాలెం ప్రాంతంలో సుమారు 45 నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు తడిసిముద్దయ్యాయి. మద్దిలపాలెం, కేఆర్ఎంకాలనీ, శివాజీపాలెం రోడ్డు, పిఠాపురంకాలనీలో రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, హైవే సర్వీసు రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కారు మబ్బులు అలుముకున్నప్పటికీ వర్షం కురవలేదు.

కుమ్మేసిన వర్షం

కుమ్మేసిన వర్షం

కుమ్మేసిన వర్షం