వికారాబాద్‌లో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో భారీ వర్షం

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

షాద్‌నగర్‌: కొడంగల్‌ నియోజకవర్గం కోస్గి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో శ్రీగురు లోకానందు సంత్‌మహారజ్‌ దేవస్థాన జాతరకు వెళ్తున్న మాజీమంత్రి హారీశ్‌రావుకు శుక్రవారం షాద్‌నగర్‌లో ఘనస్వాగతం లభించింది. దూసకల్‌ బైపాస్‌ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి, పూలమాలలు వేసి ఆహ్వానించారు. కా ర్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్‌నాయక్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌, నాయకులు లక్ష్మణ్‌నాయక్‌, రాంబల్‌నాయక్‌, మిట్టునాయక్‌, రాజావరప్రసాద్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌ పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు వాన పడింది. ప్రధాన రోడ్లు జలమయంగా మారాయి. కొద్దిరోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు చోట్ల వడగండ్ల వాన పడింది.

వీధి కుక్కల దాడిలో

జింక మృతి

మర్పల్లి: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ఉదయం జింక వచ్చింది. దీంతో వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన జింక రోడ్డుపై కుప్పకూలింది. గమనించిన ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే జింక మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

తాండూరు ఎంఈఓగా

హిందుప్రియ

తాండూరు రూరల్‌: తాండూరు ఎంఈఓగా హిందుప్రియ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటయ్యగౌడ్‌ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సీనియారిటీ ప్రకారం పాత తాండూరు ఉర్డూ మీడియం పాఠశాల జీహెచ్‌ఎం హిందు ప్రియకు బాధ్యతలు అప్పగిస్తూ డీఈఓ రేణుకాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఉపాధ్యాయులు నారాయణగౌడ్‌, మహమ్మద్‌ ఖుద్దూస్‌, అబ్దుల్‌ రహ్మన్‌, ఒమర్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం

నేడు డయల్‌ యువర్‌ డీఎం

షాద్‌నగర్‌రూరల్‌: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్‌నగర్‌ డిపో మేనేజర్‌ ఉష శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని కోరారు. 99592 26287 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement