అనారోగ్యంతో యువ సైనికుడు మృతి
నవాబుపేట: అనారోగ్యంతో ఓ యువ సైనికుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వట్టిమీనపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోముల వెంకట్రాంరెడ్డి(30) ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. రెండేళ్ల క్రితం మనీషాను వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నాడు. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురికావడంతో ఆర్మీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం నగరంలోని శంషాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రామానికి చేరుకొని పాడె మోసారు. మృతుడికి తండ్రి మోహన్రెడ్డి, తల్లి సావిత్రమ్మ, భార్య మనీషా, సోదరుడు శశివర్ధన్రెడ్డి ఉన్నారు.
అనారోగ్యంతో యువ సైనికుడు మృతి


